అది మన వాళ్ళ ముందు కాదు మన గురించి అసలు కానే కాదు!

ఇది ప్రస్తుతం తమను తాము అభ్యుదయ వాదులుగా చూపుకుంటున్న కొందరి గురించి!

మతమార్పిడి ఎప్పడి నుంచో జరుగుతూనే ఉంది, కానీ డబ్బులు ఇచ్చి చెయ్యడం తప్పు అని అంటారు తమను తాము తెలివైన వారిగా చెప్పుకునే వారు, కానీ వేరే మతం నుంచీ హిందూ మతం లోకి వస్తే వాళ్ళు డబ్బులు ఇచ్చి చేయించారు అంటారు.

మన ఆంద్ర రాష్ట్రంలో తీసుకుంటే మత మార్పిడి కి డబ్బులు నగా నట్రా విరివిగా అందుతున్నాయి అన్నది జగమెరిగిన సత్యం! ఇక్కడ ఎన్నుకున్న వారు పేద వాళ్ళు దయనీయ స్థితిలో ఉన్న వాళ్ళు అనుకుంటే తప్పు, వాళ్ళు డబ్బు పిచ్చి వాళ్ళు. ఇక కొందరికి అర్ధం అయ్యింది మత మార్పిడి చేస్తున్నాది తమ అభ్యుదయం కోసం కాదు కేవలం వాళ్ళ జేబులు నింపుకోవడానికి, దీంతో కొంత తగ్గాయి, మరి నిధులు ఆగిపోయాయి, అందుకు ఒక చట్టం తయారు చేసింది అప్పటి ప్రభుత్వం మతం మార్చుకుంటే వాళ్ళను వేరే OBC లో చేరుస్తాం మీకు ప్రభుత్వం నుంచీ వచ్చే నిధులు ఆగకుండా అని, కానీ అప్పుడు సీతారం గారు ఈ విషయం గురించి ఎందుకు ప్రశ్నించ లేదు, ఇప్పుడు ఎందుకు గుర్తుకు వచ్చింది? అలాంటివి చెయ్యకూడదు అని?

మభ్య పెట్టి మతం మార్చడం తప్పు అంటే ఈ మత మార్పిడి కోసం విదేశాల నుంచీ వచ్చే డబ్బును ఆపండి, అభ్యుదయ వాది అని చెప్పుకునే సీతారం గారు!

ఇప్పుడు రాజమహేంద్రవరం లో మనిషి అమ్మకాలు జరుగుతున్నాయి, దమ్ముంటే వాళ్ళను ఆపండి.

అక్కడ వాళ్లకు gifts వస్తున్నాయి, వాటిని ఆపండి, అందులో పనికి రానివి చాలా ఉన్నాయి, మనిషికి అవసరమైనవి అక్కడ ఏమీ లేవు!

మనిషికి సాయం చెయ్యాలి అంటే అతని మతం చూడకూడదు అని నమ్మే మీరు, యదేచ్చగా సాయం చేస్తాం అని మత మార్పిడి చేస్తున్న వాళ్ళను ఆపండి, దమ్ముంటే! అది ఏ మతం వాళ్లైనా కేవలం హిందూ మతం వాళ్ళను మాత్రమే కాదు!

ఇది సీతారం గారికి చేరుతుంది అని ఆశిస్తూ, ఇక parliament వ్యవహారాలూ సజావుగా సాగేందుకు కృషి చేస్తాడు అని ఆశిస్తూ, ఒక భారతీయుడు!

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.